Source: 
tv9telugu
https://tv9telugu.com/national/adr-reveals-regional-party-income-from-unknown-sources-was-rs-887-55-cr-in-2021-22-958423.html
Author: 
Aravind B
Date: 
17.03.2023
City: 

దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు 2021-22 ఆర్థిక ఏడాదిలో గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.887.55 కోట్లు విరాళాలుగా వచ్చినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. వాటి మొత్తం రాబడిలో ఇది 76 శాతమని పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు 2021-22 ఆర్థిక ఏడాదిలో గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.887.55 కోట్లు విరాళాలుగా వచ్చినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. వాటి మొత్తం రాబడిలో ఇది 76 శాతమని పేర్కొంది. అయితే అంతకుముందు ఏడాది వచ్చిన రూ.263.93 కోట్లతో పోలిస్తే ఇది చాలావరకు ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. రూ.20 వేల కంటే తక్కువ నగదు ఇచ్చినవారు ఉంటే ఎలక్టోరల్‌ బాండు ద్వారా విరాళం ఇచ్చిన వారి వివరాలను పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్టోరల్‌ బాండ్లు, సేల్స్‌ ఆఫ్‌ కూపన్స్‌, రిలీఫ్‌ ఫండ్స్‌,వాలంటరీ కంట్రిబ్యూషన్‌లు, మోర్చాల ద్వారా సేకరించే నిధులు మొదలైనవి ఇలాంటి గుప్త విరాళాల కిందకే వస్తాయని ఏడీఆర్‌ తెలిపింది.

అయితే తాజాగా ప్రాంతీయ పార్టీలకు వచ్చిన రూ.887.55 కోట్లలో దాదాపు 93.26 శాతం ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చినవేనని స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన 54 ప్రాంతీయ పార్టీలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకోవాలని ముందుగా అనుకోగా.. కేవలం 28 పార్టీలు మాత్రమే వార్షిక ఆడిట్‌, విరాళాల నివేదికలను సమర్పించాయని తెలిపింది. మిగతావి ఏదో ఒక రిపోర్టును మాత్రమే అందించాయని పేర్కొంది. 2021-22 ఆర్థిక ఏడాదిలో 27 ప్రాంతీయ పార్టీల సంపాదన రూ.1,165.58 కోట్లు కాగా, అందులో తెలిసిన దాతల ద్వారా వచ్చినవి రూ.145.42 కోట్లు మాత్రమేనని ఏడీఆర్‌ తేల్చిచెప్పింది.

అయితే 2021-22లో గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల ద్వారా ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఆదాయాలను పరిశీలిస్తే… అత్యధికంగా డీఎంకేకు 306.25 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత బిజూ జనతాదళ్‌కు రూ.291.96 కేట్లు, తెరాస (ఇప్పుడు భారాస)కు రూ.153 కోట్లు, వైసీపీకి రూ.60.168 కోట్లు రాగా.. తెదేపాకు రూ.3.63 కోట్లు వచ్చాయి.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method